Friday, March 29, 2024
HomeTrending Newsసామాన్యుడిపై గ్యాస్ పిడుగు

సామాన్యుడిపై గ్యాస్ పిడుగు

సామాన్యుల నెత్తిన మరోమారు గ్యాస్ ధరల భారం పడింది. దేశంలో మరోసారి పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ ధర రూ.8.00 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోగా కేంద్రప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఈ దఫా కలుపుకుంటే ఈ నెలలో రెండోసారి పెరిగిన గ్యాస్ ధరలు. తాజా పెంపుతో దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో వెయ్యి దాటిన 14 కేజీల సిలిండర్‌ ధర. దేశ రాజధాని ఢిల్లీ 14 కేజీల సిలిండర్‌ ధర రూ.1003, ముంబై లో రూ.1002.50. 14 కేజీల సిలిండర్‌ ధర కోల్‌కతా లో రూ.1029, చెన్నై లో రూ. 1018.50.

RELATED ARTICLES

Most Popular

న్యూస్