Thursday, April 18, 2024
HomeTrending Newsమార్చి 8న మన ఊరు - మన బడి

మార్చి 8న మన ఊరు – మన బడి

ముఖ్యమంత్రి కెసీఆర్ మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా.. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని సిఎం కేసిఆర్ ప్రారంభిస్తారు. మన ఉరు మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ విద్యసంస్తలను అదునీకరించనున్నారు

నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి అనంతరం కన్నెతండా లిఫ్టును సీఎం ప్రారంభిస్తారు. వనపర్తి లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును సిఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వనపర్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సిఎం ప్రసంగిస్తారు.

Also Read : మన ఊరు – మన బడితో మహర్దశ

RELATED ARTICLES

Most Popular

న్యూస్