Thursday, April 25, 2024
Homeసినిమా‘వరుడు కావలెను’ పెళ్ళి వేడుక పాట విడుదల

‘వరుడు కావలెను’ పెళ్ళి వేడుక పాట విడుదల

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. నేడు (2-10-2021) ఈ చిత్రంలోని ఓ వీనుల విందైన గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే కన్నుల పండుగ గా అ(క)నిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే…‘‘ వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు …వయ్యారం చిందేసే అందాల భామలు” అంటూ సాగే ఈ గీతం రచయిత రఘురామ్ రచిం చారు. ఈ గీతాన్ని గాయనీ, గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, ఎం ఎల్ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతి రంజని లు వీనుల విందుగా ఆలపించారు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం హుషారుగా సాగుతుంది. చిత్ర నాయకా నాయిక లు ‘నాగశౌర్య, రీతువర్మ‘ లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్ర కథానుసారం ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో తెర రూపంగా ఈ గీతం కనిపిస్తుంది. హుషారైన సంగీతం, చక్కని సాహిత్యం ఈ పాట సొంతం. వీటికి తోడు బృంద మాస్టర్ నృత్య రీతులు మరింత హుషారెత్తిస్తాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 న దసరా కానుకగా చిత్రం విడుదల కానుంది.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశి, క‌థ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్