Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది. దర్శకులు సుకుమార్, వీవీ వినాయక్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ…’మెరిసే మెరిసే’ లో మంచి మ్యూజిక్ కుదిరింది. విజయ్ ప్రకాష్, చిన్మయి, లిప్సిక, అనురాగ్ కులకర్ణి వంటి సింగర్స్ చాలా బాగా పాడారు. శేఖర్ కమ్ముల గారి సినిమాలా ప్లెజంట్ గా ఉంటుంది అన్నారు.

“మా కొత్తూరి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ద్వారా పవన్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా మిగతా ఆర్టిస్ట్ లు అంతా చక్కగా నటించారు. ‘మెరిసే మెరిసే’ ఆగస్టు 6న పీవీఆర్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతోంది” అని తెలిపారు నిర్మాత

‘మెరిసే మెరిసే’ మూవీ యువత ఆలోచనలు, ఆశలు, కోరికల గురించి తీసిన సినిమా. 20 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండదు. అలాంటి అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు. వీళ్లు ఇద్దరు ఎలా తారసపడ్డారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అందుకున్నారు అనేదే ఈ సినిమా. ఈ టైమ్ లో థియేటర్లలో రిలీజ్ అవసరమా అంటే అవసరమే అని చెబుతాను. ఎందుకంటే మన టెన్షన్స్ రిలీఫ్ అయ్యేది థియేటర్ లలోనే. సో థియేటర్ లకు వచ్చి మా శ్వేతా, దినేష్ పర్మార్మెన్స్ చూస్తారని ఆశిస్తున్నా” అని దర్శకుడు పవన్ అన్నారు.

థియేటర్లలోనే సినిమా చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు నాయిక శ్వేతా అవస్థి,  హీరో దినేష్ తేజ్. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, ఇతర చిత్ర బృందం పాల్గొని ‘మెరిసే మెరిసే’ సినిమా విజయం సాధించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com