Friday, March 29, 2024
HomeTrending Newsబెదిరిస్తే ఓట్లు రాలవు- హరీష్ రావు

బెదిరిస్తే ఓట్లు రాలవు- హరీష్ రావు

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకున్నామన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గౌడకులస్థుల సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

గతంలో 2 ఏళ్లకోసారి కల్లుడిపోల లైసెన్సుల పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీన్ని పదేళ్లకు పెంచామని మంత్రి తెలిపారు. కల్లు ఆరోగ్యానికి మంచిదని భావించి.. హైదరాబాద్ లో నీరా షాపులు ఓపెన్ చేస్తున్నామని, కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రారంభించేవాళ్లం. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభిస్తామన్నారు. నీరా దుకాణాలు హైదరాబాద్ లో సక్సెస్ అయితే.. అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామన్నారు.

50 ఏళ్లకే గీతకార్మికులకు 2016 రూపాయల ఫించన్ ఇస్తున్నామని, ముదిరాజ్ లకు ఇచ్చినట్లుగా గీతకార్మికులకు లూనా(మోపెడ్)లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని మంత్రి తెలిపారు. రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా తీసుకురాబోతున్నాం. ఇదే తరహాలో మత్స్య, చేనేత కార్మికుల బీమా కూడా తేవాలని సీఎం ఆలోచిస్తున్నారని, పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా ఈత, తాటి వనాలు పెంచుతున్నాం.

ఇన్ని మీకోసం మా ప్రభుత్వం చేస్తుంటే.. ఎందుకు బీజేపీకి ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పట్టించుకోవడం లేదు.  చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని, బీసీ జనాభా గణన చేయాలని అడిగితే స్పందించడం లేదు. కేరళ మంత్రి మురళీధరన్ ను ఇక్కడికి తీసుకువచ్చి.. మీ గౌడన్నను తెచ్చాం.. ఓటేయండి అని అడుగుతున్నారు. ఆయన మీటింగ్ కు మీరు కూడా వెళ్లారు కదా… మీకోసం ఒక్క హామీ అయినా ఆ కేంద్రమంత్రి ఇచ్చాడా అని అడిగారు.

బీజేపీవాళ్లు ఇక్కడ ఏం చేస్తారో చెప్పకుండా.. బెదిరింపులకు, దాదాగిరీలకు దిగుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నీ భరతం పాడుతనని ఈటల రాజేందర్ నన్ను బెదిరిస్తున్నడు. నా భరతం పడితే నీకేంవస్తుందన్నారు. బెదిరిస్తే ఓట్లు రాలవు.. మీరు చేసే పనుల వల్ల ఓట్లు వస్తాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్