Thursday, April 25, 2024
HomeTrending Newsమునుగోడు దత్తత తీసుకుంటా - కేటీఆర్

మునుగోడు దత్తత తీసుకుంటా – కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తాను. అభివృద్ధిలో అండ‌గా ఉంటాను. రోడ్ల‌ను అభివృద్ధి చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచండి. త‌ప్ప‌కుండా అభివృద్ధిలో ప‌య‌నిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచేందుకు కృషి చేద్దామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్‌కు మునుగోడు క‌ష్టం తెలుస‌న్నారు. 2006లో 32 మండ‌లాలు తిరుగుతూ.. ఆయ‌న స్వ‌యంగా పాట రాశారు. చూడు చూడు న‌ల్ల‌గొండ‌.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాట రాసిండు. శివ‌న్నగూడెంలో నిద్రించి నాడు ఒక మాట ఇచ్చారు. తాగునీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అయిండు. ఏ ఒక్క‌రూ కూడా మంచి చేయ‌లేదు. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత‌, మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పి, ఇచ్చిన హామీని నెర‌వేర్చారు. న‌ల్ల‌గొండ జిల్లాకు అనుకొని కృష్ణా న‌ది వెళ్తున్న‌ప్ప‌టికీ, తాగు, సాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేదు. రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్ట‌లేదు. తాగునీరు ఇవ్వ‌లేదు. ఇవాళ కేసీఆర్ ప్ర‌భుత్వంలో చెర్ల‌గూడెం, శివ‌న్న‌గూడెం రిజ‌ర్వాయ‌ర్ క‌ట్టి రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు నీరు ఇవ్వ‌బోతున్నాం. ల‌క్ష్మ‌ణ‌ప‌ల్లి రిజ‌ర్వాయర్ చేప‌ట్టాం. చెరువుల‌ను నింపుతున్నాం.

ల‌క్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుంది. 10 ఏండ్ల‌కు ముందు మునుగోడు ఎలా ఉండే..? ఇప్పుడు మునుగోడు ఎలా ఉందో? ఆలోచించాలి. ఒక‌ప్పుడు రాత్రి స‌మ‌యాల్లో బావుల వ‌ద్ద‌కు వెళ్లి మోటార్లు వేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నాం. ఉమ్మ‌డి ఏపీలో విత్త‌నాలు పోలీసు స్టేష‌న్‌లో పెట్టి ఇచ్చేవారు. అవి కూడా క‌ల్తీ విత్త‌నాలే. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చ‌నిపోయినా.. వారం రోజుల్లో రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నాం. తాగు, సాగునీటితో పాటు క‌రెంట్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. ప్ర‌ధానులు ప‌ట్టించుకోని స‌మ‌స్య‌ను కేసీఆర్ ప‌రిష్క‌రించారు. 1996లో న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 400 మంది నామినేష‌న్లు వేసి దేశ దృష్టిని ఆక‌ర్షించారు. కానీ ప‌రిష్కారం దొర‌క‌లేదు. కేసీఆర్ వ‌చ్చాక ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త విముక్తి క‌ల్పించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్