Saturday, April 20, 2024
Homeసినిమాథ్యాంక్యూ నుంచి మ్యూజికల్ మెలోడి విడుదల

థ్యాంక్యూ నుంచి మ్యూజికల్ మెలోడి విడుదల

Melody: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న  చిత్రం ‘థ్యాంక్యూ‘. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ” ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. చూసే చూపేంటో..మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో” అంటూ కొనసాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుడు తమన్ స్వరాలను అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జులై 8న విడుద‌ల చేస్తున్నారు.

Also Read : థ్యాంక్యూ నుంచి ‘మారో మారో’ సాంగ్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్