Saturday, April 20, 2024
HomeTrending Newsబసవతారకంలో అత్యాధునిక ఆక్సిజన్ కేంద్రం

బసవతారకంలో అత్యాధునిక ఆక్సిజన్ కేంద్రం

Basavatarakam Cancer Hospital :

బసవతారకం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స అందించటంతో పాటు ఎప్పటికపుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించడంలో ముందంజలో ఉండే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో సరికొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఆక్సిజన్ ప్లాంట్ లో 95 శాతం నాణ్యతతో కూడిన ప్రాణవాయువును నిమిషానికి 500 లీటర్ల చొప్పున ఉత్పత్తి చేయనుంది. నేటి ఉదయం హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో ఆక్సిజన్ ప్లాంట్ ను నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మరియు హాస్పిటల్ CEO డా. ఆర్ వి ప్రభాకర రావు తదితరులతో కలసి ప్లాంట్ ఆవరణలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్లాంట్ ను స్విఛ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ఉదృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నారని, ఆక్సిజన్ ను విమానాలలో,ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ BIACH&RI యాజమాన్యం, సిబ్బంది కృషితో అలాంటి ఇబ్బందులు హాస్పిటల్ లో తలెత్తకుండా చూశామని తద్వారా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూడడానికి ఈ సరికొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రసిద్ద ఫార్మా దిగ్గజం నొవార్టిస్ అందించిన కోటి 20 లక్షల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో కూడా సంస్థ CEO డా. ఆర్ వి ప్రభాకర రావు కృషితో నొవార్టిస్ కంపెనీ 3 కోట్ల 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారని తెలియజేస్తూ కంపెనీకి కృతతలు తెలియజేశారు. రాబోయే రోజులలో ఏ ఉద్దేశ్యంతో ఈ హాస్పిటల్ ను స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారో ఆ లక్ష్యాలను చేరుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ , ఛైర్మన్, BIACH&RI లతో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావ్, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా వీరయ్య ఛైదరి, రేడియాలజీ విభాగాధిపతి, BIACH&RI; రామాంజనేయులు గౌడ్, విభాగాధిపతి, బయోమెడికల్ విభాగం, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.

Also Read :  ఏపీ సీఎంకు సిరివెన్నెల కుటుంబం ధన్యవాదాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్