Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్డబుల్స్ లో నిరాశ, శ్రీకాంత్ ఓటమి

డబుల్స్ లో నిరాశ, శ్రీకాంత్ ఓటమి

BWT- Doubles out:
బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-2001 టోర్నీలో నేడు రెండోరోజు తొలి అర్ధ భాగంలో ఇండియాకు నిరాశ ఎదురైంది. కిడాంబి శ్రీకాంత్ రెండో మ్యాచ్ లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుత్ విటిడ్ సర్న్ చేతిలో 21-18, 21-7 తేడాతో ఓటమి పాలయ్యాడు. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు తోమ జూనియర్ పోపోవ్ పై 21-14, 21-16 తేడాతో విజయం సాధించిన శ్రీకాంత్ నేడు ఆ టెంపో ను కొనసాగించలేకపోయాడు.

మరోవైపు మహిళల డబుల్స్ లో భారత ఆటగాళ్ళు సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప, బల్గేరియాకు చెందిన అక్కచెల్లెళ్ళ జోడీ గాబ్రియేలా, స్టెఫానీ స్తోయేవా చేతిలో 21-19, 21-20 తేడాతో ఓటమి పాలయ్యారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో జపాన్ క్రీడాకారుల చేతిలో 21-14, 21-18 తో ఓటమి పాలైన ఈ భారత జోడీ ఈరోజు మాత్రం హోరాహోరీగా తలపడ్డారు కానీ విజయం సాధించలేకపోయారు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో డెన్మార్క్ ఆటగాళ్ళ చేతిలో పరాజయం పాలైన ఈ జోడీ నేడు ఆట మొదలు పెట్టకముందే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

మహిళల, పురుషుల సింగిల్స్ ఆడుతున్న మన ఆటగాళ్ళు పివి సింధు, లక్ష్య సేన్ తదుపరి మ్యాచ్ లో కాసేపట్లో జరగనున్నాయి.

Also Read : పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్