Sunday, February 23, 2025
HomeTrending Newsసెమీస్ కు చేరిన సింధు

సెమీస్ కు చేరిన సింధు

టోక్యో ఒలింపిక్స్ లో మహిళల  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం, ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి. వి. సింధు సెమీ ఫైనల్స్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ కు చెందినా యమగుచిపై 21-13, 22-20 తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. మొదటి సెట్ లో సింధు తన ఆధిపత్యం కొనసాగించింది. రెండో సెట్ లో యమగుచి గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన సెట్ లో ఓ స్థాయిలో ­20-20 కు వచ్చారు. ఈ దశలో సింధు తనదైన ఆట తీరు ప్రదర్శించి సెమీస్ లోకి అడుగుపెట్టింది.

సింధు- యమగుచి ఇప్పటివరకూ 19 మ్యాచ్ లు తలపడగా సింధు 12, యమగుచి 7 మ్యాచ్ లలో విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్