Wednesday, May 29, 2024
HomeTrending NewsYSRCP Samajika Bus Yatra: పల్నాడు గడ్డ - జగనన్న అడ్డా: అంజాద్ భాషా

YSRCP Samajika Bus Yatra: పల్నాడు గడ్డ – జగనన్న అడ్డా: అంజాద్ భాషా

పల్నాటి పౌరుషం పుట్టిన గడ్డ మాచర్లలో సామాజిక సాధికార యాత్ర జరగడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. సామాజిక సాధికారత గతంలో కేవలం నినాదంగా ఉండేదని, కానీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధికారత సాధించారని వెల్లడించారు. చంద్రబాబు మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసేవారని, జగన్‌ మాత్రం వారికి కీలక పదవులు ఇచ్చి, డిప్యూటీ సీఎం హోదా కూడా కల్పించారని వివరించారు.  వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతోన్న సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు మాచర్లలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత అయిదేళ్ల  బాబు పాలనలో రూ.2600 కోట్లుఖర్చుపెడితే.. జగన్ హయంలో నాలుగున్నరేళ్లలోనే రూ. 23,176 కోట్లు ఖర్చు చేశారని… పల్నాడు గడ్డ.. జగనన్న అడ్డా అని అంజాద్ భాషా ధీమా వ్యక్తం చేశారు.

రూ.22,423 కోట్ల సంక్షేమం మాచర్లలో జరిగింది – ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
గడిచిన నాలుగున్నర ఏళ్ల నుంచి రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మాచర్ల ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా చేయి పట్టుకుని వైఎస్సార్‌సీపీ నడిపిస్తోందని అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి నాయకత్వంలో పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమాని పిన్నెల్లి స్పష్టం చేశారు.

అణగారినవర్గాలు సాధికారత సాధించాయి – ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌
ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారతకు సిఎం జగన్ కృషి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌యాదవ్‌ అన్నారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు.. రాష్ట్రానికి వెన్నెముక అని వ్యాఖ్యానించారు. జగన్‌ దగ్గర పనిచేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని భావోద్వేగంతో అన్నారు. మరో అయిదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనలేక చాలా మంది కలిసి వస్తున్నారని,వారందరికీ ప్రజలు బుద్ది చెప్పాలని అనిల్‌ పిలుపు ఇచ్చారు. ఎవరైనా తాను గెలవాలని పార్టీ పెడతారు, కానీ ప్రపంచంలోనే పక్కనోళ్లని గెలిపించడానికి పార్టీ పెట్టిన నాయకుడు పవన్‌ కల్యాణ్ అని…  అలాంటి వ్యక్తి వచ్చిజగన్‌ను ఓడిస్తామని పిచ్చి ప్రేలాపనలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. కానీ జగన్‌ను ఓడించడం ఎవరితరం కాదని అన్నారు.  చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే నిజం గెలిచిందని లోకేష్‌ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నాడని, చంద్రబాబు రోగాలు నయం చేసుకోవడానికి జైలు నుంచి వచ్చారని, త్వరలోనే మళ్లీ జైలుకు వెళ్తారని అన్నారు. మాచర్ల ప్రజలు మరోసారి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.

ఇంటింటికీ కుళాయి ఇచ్చాం – ఎంపీ లావు కృష్ణదేవరాయలు
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్‌ అని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పదవులు ఇచ్చి వారికి రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఎంపీ అన్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో ఒక మెడికల్‌ కళాశాల, వరికిపూడిశాల ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకొచ్చారని, మాచర్లలో బైపాస్‌ నిర్మాణం, జలజీవన్‌ మిషన్‌ పథకం కింద ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చామని ఎంపీ తెలిపారు. పార్లమెంట్‌ పరిధిలో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంపీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ది పనులు చేపడతామని స్పష్టం చేశారు.

దళితులంటే చంద్రబాబుకు ఇష్టం లేదు. – ఎంపీ నందిగం సురేష్‌.
చంద్రబాబు నిత్యం పెత్తందారుల గురించి ఆలోచిస్తారని, సీఎం జగన్‌ మాత్రం పేదల కోసం, వారి సంక్షేమం కోసం నిత్యం ఆలోచిస్తారని ఎంపీ నందిగం సురేష్‌ పేర్కొన్నారు. చంద్రబాబు అబద్దాలు చెప్పి పబ్బంగడపుకుంటారని ఎంపీ ఆరోపించారు. దళితుల పిల్లలు మంచిగా చదువుకోకూడదని, వారెప్పుడూ బానిసలుగా ఉండాలని చంద్రబాబు ఇంగ్లీష్‌ మీడియం వద్దని కోర్టులకు వెళ్లారని, ఇక అమరావతిలో ఇళ్ల స్థలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు ఓర్వలేకపోయి.. కోర్టులో కేసులు వేశారని ఎంపీ సురేష్‌ విమర్శించారు.

సీఎం జగన్‌ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని  అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్‌ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్