7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeతెలంగాణసంతోష్  ను అభినందించిన ప్రధాని

సంతోష్  ను అభినందించిన ప్రధాని

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ అద్భుతమని మోడీ కొనియాడారు. దీని గురించి తెలుసుకొని మనసు ఉప్పొంగిందని సంతోష్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  ప్రధాని ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సంతోష్ వెల్లడించారు, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సమాజానికి ఉపయోగపడేకార్యక్రమం ఏదైనా చేయాలనే తలంపుతోనే మూడేళ్ళ క్రితం ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంతోష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసియార్ కు పచ్చదనం అంటే ఎంతో అభిమానం ఉందని, అందుకే ముఖ్యమంత్రి కాగానే ‘తెలంగాణకు హరితహారం’ మొదలు పెట్టారని, ఆయన స్పూర్తితోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వివరించారు. ఈ మూడేళ్ళలో ఎంతోమంది నాయకులు, సినీ నటులు, సామాజిక వేత్తలు మద్దతు పలికి ప్రోత్రహించారని సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్