Tuesday, September 24, 2024
HomeTrending Newsపోలవరం అగాథాలు పూడ్చే పనులు ప్రారంభం

పోలవరం అగాథాలు పూడ్చే పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1, 2 ల్లో  గతంలో  వచ్చిన వరదల వల్ల ఏర్పడిన అగాథాలను పూడ్చే ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టారు.  డాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డి డి ఆర్ పీ ) ఆమోదించిన డిజైన్ ప్రకారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.   జలవనరుల శాఖ ఎస్ ఈ  నరసింహమూర్తి, ఈఈ లు మల్లికార్జున రావు, పాండురంగయ్య,  మేఘా ఇంజనీరింగ్  అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రతినిధులు గ్యాప్ 1, 2 లలో పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు.  ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పడిన అగాథాలను పూడ్చటంలో భాగంగా ఇసుకను అక్కడ డోజర్ల ద్వారా నింపుతున్నారు. ఇసుకను నింపిన తరువాత వైబ్రో క్యాంపక్షన్ విధానం ద్వారా ఆ ప్రాంతాన్ని గట్టి పరుస్తారు.

ఇది పూర్తయిన తరువాత  తాజాగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్ హె చ్ పి సి ) డయాఫ్రామ్ వాల్ పటిష్టతపై ఇచ్చిన నివేదిక ఆధారంగా డి డి ఆర్ పీ ఆమోదం పొందిన తరువాత  పనులు చేపడతారు. డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి ఐన తరువాత  ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) పనులు మొదలు పెడతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్