Saturday, July 27, 2024
HomeTrending Newsపేపర్ లీకేజీతో కేటీఆర్ కు సంబంధం ఉంది - బండి సంజయ్

పేపర్ లీకేజీతో కేటీఆర్ కు సంబంధం ఉంది – బండి సంజయ్

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. నిరసన దీక్ష చేసేందుకు హైదరాబాద్ లో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి పాదయాత్రగా గన్ పార్క్ వద్దకు బయలుదేరిన బండి సంజయ్ గన్ పార్క్ వద్ద నివాళి అర్పించి దీక్ష చేపట్టేందుకు సిద్దమయ్యారు. అయితే బీజేపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బిజెపి నేతలను అరెస్టు చేశారు. అమరవీరులకు నివాళులు అర్పించేందుక పోలీస్ అనుమతి అవసరం లేదన్న బండి సంజయ్…గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించి తీరుతామన్నారు. తిండి లేక.. తిప్పలు లేకుండా రాత్రి పగలు చదువుకుని పరీక్షలు రాస్తే.. అలాంటి పిల్లల జీవితాలను నాశనం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. కష్టపడి చదివిన నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రి వర్గం తప్పు చేయలేదనుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ను పూర్తిగా రద్దు చేయాలన్నారు. అందర్నీ బదిలి చేయాలన్నారు. ఫాంహౌజ్, నయీం వంటి కేసులను సిట్ దర్యాప్తు చేస్తే ఏమైందని ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో కేటీఆర్ కు సంబంధం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.కేటీఆర్ ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. సీఎం ఫ్యామిలీకి ఓ న్యాయం..సామాన్యుడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలో నిందితురాలు రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీలో ఉందని గుర్తు చేశారు. టీఎస్సీ పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనకడు వేసేది లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు భయపడొద్దని….బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూర్ఖుడి పాలనను అందరి కలిసి కట్టుగా కొట్లాడి అంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు భయపడితే.. బరితీసి కొట్లాడకుంటే.. బతుకులు నాశనం అవుతాయన్నారు.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కేసీఆర్ కు చెంపచెల్లుమనేలా టీచర్లు తీర్పు ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. టీచర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వలేదు.. బదిలీలు లేవు.. ప్రమోషన్స్ లేవన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 700 కోట్ల రూపాయలు పెట్టి ఓడించాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థులు, బీజేపీ నేతలు, బీజేవైఎం విద్యార్థి నాయకులు కొట్లాడితే అక్రమంగా అరెస్ట్ చేశారని..లాఠీ చార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారుకు దమ్ముంటే ఇప్పుడు ఆపాలని సవాల్ విసిరారు.

Also Read : నిరుద్యోగులకు అండగా పోరాటం ఉదృతం – బిజెపి

RELATED ARTICLES

Most Popular

న్యూస్