Thursday, March 28, 2024
Homeసినిమాప్రభాస్, మైత్రీ మూవీ క్యాన్సిల్ అయ్యిందా..?

ప్రభాస్, మైత్రీ మూవీ క్యాన్సిల్ అయ్యిందా..?

ప్రభాస్ వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే.. ప్రభాస్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కు భారీగా అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్ వినిపించింది. త్వరలోనే ప్రభాస్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో మూవీ అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

తాజా వార్త ఏంటంటే… సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫైటర్’. ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడుగా చేయాలి. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే నెలల తరబడి వర్క్ చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆతర్వాత చేయనున్న టైగర్ వెర్సెస్ పఠాన్ స్ర్కిప్ట్ కి ఓ సంవత్సరం పడుతుంది. ఈ చిత్రాన్ని 2024లో ప్రారంభించాలి అనుకుంటున్నారు. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనేది ప్లాన్.

అందుచేత ప్రభాస్ తో సినిమా చేయాలంటే.. ఇప్పుడున్న బిజీలో సిద్ధార్థ్ ఆనంద్ కనీసం కథ రెడీ చేయలేని పరిస్థితి. అందుకే ‘వార్ 2’ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయాల్సింది కానీ.. అయాన్ ముఖర్జీకి అప్పగించారట. ఈ కారణంగానే అడ్వాన్స్ ని సిద్దార్థ్ మైత్రి నిర్మాతలకు వెనక్కు ఇచ్చేసినట్టు ముంబైలో టాక్ వినిపిస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ కాంబినేషన్ సెట్ చేసుకునేలా ఓ మాట అనుకుని డ్రాప్ అయ్యారట. మొత్తానికి క్రేజీ కాంబో ఇలా మిస్ అయ్యింది. మరి.. ఈ భారీ, క్రేజీ కాంబో మూవీ ఎప్పుడు సెట్ అవుతుందో..? ఎప్పటికీ సెట్స్ పైకి వస్తుందో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్