Friday, March 29, 2024
Homeసినిమామళ్ళీ మిర్చి కాంబినేషన్!

మళ్ళీ మిర్చి కాంబినేషన్!

Another Mirchi: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల రాధేశ్యామ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ త‌ర్వాత స‌లార్ మూవీ స‌మ్మ‌ర్ లో విడుద‌ల కానుంది. త్వ‌ర‌లో మారుతి డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌నున్నారు.

ఇదిలా ఉంటే… బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ-ప్ర‌భాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘మిర్చి‘  బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆత‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయాలనుకున్నారు కానీ.. కుద‌ర‌లేదు. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం. సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకి వెళ్లడానికి ముందే కొరటాల, ప్రభాస్ మధ్య కథా చర్చలు జరిగాయని తెలిసింది.

ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలు పూర్తైన త‌ర్వాత కొరటాలతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. కొర‌టాల తెర‌కెక్కించిన ఆచార్య ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఆత‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత కొర‌టాల‌.. ప్ర‌భాస్ మూవీ వ‌ర్క్ స్టార్ట్ చేస్తార‌ని స‌మాచారం

Also Read : బన్నీ, ధ‌నుష్, కొర‌టాల‌ కాంబినేష‌న్ నిజ‌మేనా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్