Friday, April 19, 2024
HomeTrending Newsబాల్క సుమన్ కాదు..బానిస సుమన్ -  వైఎస్ షర్మిల

బాల్క సుమన్ కాదు..బానిస సుమన్ –  వైఎస్ షర్మిల

కేసీఅర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మోసం చేసే వారిని 420 అంటారు. అందుకే కేసీఅర్ 420 అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా చెన్నూరు నియోజక వర్గం భీమారం మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన భారీ బహిరంగ సభలో YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చెన్నూరు నియోజక వర్గానికి కేసీఅర్ చేసింది మోసమేనన్నారు.

వైఎస్ షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…

ప్రాణహిత – చేవెళ్ల ద్వారా చెన్నూరుకి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని YSR అనుకున్నారు. ఈ నియోజక వర్గానికి తుమ్మడిహట్టి ద్వారా సాగు నీరు అందేది. ప్రాజెక్ట్ డిజైన్ మార్చి ఈ నియోజక వర్గానికి అన్యాయం చేశారు. గొల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుకున్నారు. ప్రాజెక్ట్ కట్టిస్తే ఇప్పుడు వైఎస్సార్ కి పేరు వస్తుంది అని ఈ ప్రభుత్వం కాలువలు కూడా తవ్వించడం లేదు. చెన్నూరు నియోజక వర్గం సింగరేణి నియోజక వర్గం. కోల్ బెల్ట్ ఏరియాలో 30 వేల మందికి పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు. ఇప్పుడు కేసీఅర్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేక పోయారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే ఉంటాయని కేసీఅర్ చెప్పి మోసం చేశారు. ఓపెన్ కాస్ట్ ఉండదు అని…కుర్చీ వేసుకొని బంద్ చేస్తా అని అన్నాడు. కుర్చీ దొరకలేదు… పైగా ఓపెన్ కాస్ట్ లు 19 కి పెంచారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ పూర్తిగా బంద్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అన్నాడు.. ఒక్కరినీ రెగ్యులర్ చేయలేదు. బాస్ డిపో అన్నాడు..మోసం. రెవెన్యూ డివిజన్ అని మోసం. మందమర్రి ఎన్నికలు అని మోసం

ఇక ఈ ఎమ్మెల్యే బాల్క సుమన్. తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యిందట. ఈయన విద్యార్థి నాయకుడిగా ముదిరి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా ముదిరి గూండా అయ్యాడు. స్వపక్షం,ప్రతిపక్షం అని తేడా లేకుండా అందరికీ వార్నింగ్ లు ఇస్తాడట కదా. దౌర్జ్యనం చేస్తాడట కదా.. ఎవ్వరినీ వదిలి పెట్టాడట కదా. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే ఇంటికి పిలిచి తన్నిస్తడట కదా. జర్నలిస్ట్ లు అని చూడకుండా కేసులు. ఎంత ఘటికుడు ఈ బాల్క సుమన్. చేసేది మొత్తం రౌడీ ఇజం. 100 రూపాయలు కూడా నా జేబుల్లో లేవు అని చెప్పిన ఈ ఎమ్మెల్యే 100 ల కోట్లు ఎలా సంపాదించారు. ఎక్కడ లేని భూ కబ్జాలు ఇక్కడే నట. ప్రభుత్వ భూములు,ఇసుక మాఫియా,సింగరేణి భూములు అన్ని కబ్జా. ఎన్నికల్లో ఈ బాల్క సుమన్ ను నా కొడుకు అని కేసీఅర్ అన్నాడు. కొట్లాడి సాదించుకోగలడు అని కేసీఅర్ అన్నాడట కదా. కొడుకు అయితే సిరిసిల్ల ఎలా ఉంది… ఈ చెన్నూరు ఎలా ఉంది. కొడుకు అన్నందుకు కేసీఅర్ మీద,కెటిఆర్ మీద ఈగ కూడా వాలనివ్వడట. మహారాష్ట్రలో బాల్ థాక్ రే ను ఏమైనా అంటే ఎవరైనా వదిలి పెడతారా అంటాడట. ఈయన బాల్క సుమన్ నా…బానిస సుమనా…? ఉద్యమ సమయంలో ఎంత మంది నిరుద్యోగులకు రెచ్చ గొట్టాడు..? ఆత్మహత్యలకు కారకుడు అయ్యాడు కదా..? మీ మాజీ ఎమ్మెల్యే నే ఈ విషయం చెప్పాడు కదా.. విద్యార్థి నాయకుడు అయి ఉండి ఒక్క సారైనా ఆత్మహత్యల మీద మాట్లాడినడ…? ఈ నియోజక వర్గంలో మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ కూడా రాశాడు. నా చావే ఆఖరి చావు అని కూడా అన్నాడు. మీ కాళ్ళు మోక్కుతా అంటూ లెటర్ లో రాసి పెట్టీ మరి చనిపోయాడు. కనీసం ఈ ఎమ్మెల్యే ఆ నిరుద్యోగి ఇంటికి వెళ్ళాడా..? కనీసం ఒక రూపాయి సహాయం చేశాడా..ఈ దుర్మార్గపు బాల్క సుమన్ ఎప్పుడైనా పరామర్శ చేశాడా. అదుకోవడం చేతకాదు కానీ… ఆ మహేష్ కుటుంభంతో నా కొడుకు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య అని పోలీస్ స్టేషన్ లో చెప్పించడాట. ఈయన దళిత ఎమ్మెల్యే.  దళిత బిడ్డలకు అన్యాయం చేస్తుంటే నోరు విప్పలేదు. సొంత జాతికి అన్యాయం చేశాడు. దొరతో డైనింగ్ టేబుల్ మీద కూర్చునే సరికి ఈ ఎమ్మెల్యే కూడా ఒక దొర అయ్యాడు. ఇప్పుడు దొరల పోకడ..ఎవరు మాట వినడట కదా

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఈ చెన్నూరు కి ఒక్క ఎకరాకు సాగు నీరు రాలేదు. కానీ ఆ కాళేశ్వరంతో 40 వేల ఎకరాలు నీట మునుగుతున్నాయి. కనీసం మునిగిన పంట పొలాలకు పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు. అందుకే చెప్తున్న… ఒకటే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఈసారి ఈ ఎమ్మెల్యేకి కర్రు కాల్చి వాత పెట్టండి. ప్రతి వర్గాన్ని కేసీఅర్ మోసం చేశాడు. తెలంగాణలో సమస్యలు లేవని కేసీఅర్ చెప్తున్నారు. సమస్యలు ఉన్నాయని 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశ. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ.

Also Read : వైఎస్సార్ పథకాల్ని తీసుకొస్తాం వైఎస్ షర్మిల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్