Friday, September 20, 2024
HomeTrending Newsఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ

ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇప్ప‌టికీ కొంద‌రు భార‌త పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండ‌డంతో భార‌త పౌరుల త‌ర‌లింపులో నిరంత‌రం స‌హ‌కారం అందించాలని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను మోదీకి జెలెన్ స్కీ వివ‌రించారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ప్ర‌త‌క్ష చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలని ప్రధాని చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Also Read : నాటో స్వార్థానికి ఉక్రెయిన్ బలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్