Friday, March 29, 2024
Homeసినిమా‘రాధే శ్యామ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ నిజ‌మేనా?

‘రాధే శ్యామ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ నిజ‌మేనా?

Only on big Screen: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్‌. పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది కానీ.. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు మేక‌ర్స్ మ‌రో మంచి రిలీజ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు. మార్చి 18న రాధేశ్యామ్ రిలీజ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ సినిమాను ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయ‌బోతున్నారని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

దేశం యావ‌త్తు థియేట‌ర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోవ‌డానికి మ‌రికొన్ని రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంది. అయితే ‘రాధే శ్యామ్’ ల‌వ్‌స్టోరి కాబ‌ట్టి.. రానున్న వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ ‘రాధే శ్యామ్’ మేక‌ర్స్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతుందని, త్వ‌ర‌లోనే దీని పై క్లారిటీ వ‌స్తుంద‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే.. ఈ వార్త‌ల‌ను ‘రాధే శ్యామ్’ మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ తోసిపుచ్చారు.

డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ త‌మ మూవీ థియేట‌ర్స్‌లోనే రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌క‌టించేశారు. అలాగే ‘గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ సౌండ్, గ్రాండ్ మేకింగ్.. గ్రాండ్ లవ్‌తో రాధే శ్యామ్ సినిమాను రూపొందించాం. నేను మీతో క‌లిసి థియేట‌ర్స్‌లోనే సినిమాను చూస్తాను’ అంటూ తమన్ ట్వీట్ చేయడం విశేషం. సో… రాధేశ్యామ్ ఓటీటీలో కాదు.. థియేట‌ర్లోనే రిలీజ్ కావ‌డం ఖాయం.

Also Read : ప్రభాస్ రేంజే వేరు .. 20 కోట్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్