Monday, May 20, 2024
Homeసినిమారాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది

రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది

Radheshyam  Update:
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ – క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ పిరియాడిక్ ల‌వ్ స్టోరీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌లేదు అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓ అభిమాని అయితే.. ఏకంగా రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌లేని కార‌ణంగా సూసైడ్ చేసుకుంటాను అంటూ ఓ లెట‌ర్ కూడా రాయ‌డం.. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం జ‌రిగింది.

అయితే.. ఎట్ట‌కేల‌కు రాధేశ్యామ్ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. ఈ నెల 15న సాయంత్రం 5 గంట‌ల‌కు ‘ఈ రాత‌లే..’ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా స్పీడుగా జ‌రుగుతుంది. ప్రమోష‌న్ స్టార్ట్ చేశారు కాబ‌ట్టి ఇక నుంచి రాధేశ్యామ్ నుంచి వ‌రుస‌గా అప్ డేట్స్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్ యూట్యూబ్ లోఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:  అంచనాలు పెంచిన రాధేశ్యామ్ టీజర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్