Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో  ఇండియా తరపున ఒకే ఒక జోడీ సెమీస్ కు చేరగలిగింది.  పురుషుల డబుల్స్  లో  సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ  24-22; 21-15, 21-14తో  జపాన్ ద్వయం టకురో హోకి-యుగో కొబ్యాసి పై గెలిపొంది పతకం రేస్ లో నిలిచారు.

కాగా, మరో మ్యాచ్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల జోడీ 8-21; 14-21 తేడాతో  ఇండోనేషియా జంట మహమ్మద్ ఆసాన్-హేంద్ర సేతివాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పురుషుల  సింగిల్స్ లో కూడా హెచ్ ఎస్ ప్రన్నోయ్ పోరాడి ఓడిపోయారు. చైనా ఆటగాడు ఝావో జున్ పెంగ్ పై 21-19; 6-21;18-21  తేడాతో ఓటమి పాలై నిష్క్రమించాడు.

Also Read : క్వార్టర్స్ కు ప్రణయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com