Wednesday, March 26, 2025
HomeTrending Newsమైక్రో సాఫ్ట్ కొత్త చైర్మన్ గా సత్య నాదెళ్ళ

మైక్రో సాఫ్ట్ కొత్త చైర్మన్ గా సత్య నాదెళ్ళ

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ కంపెనీ కొత్త ఛైర్మన్ గా సత్య నాదెళ్ళ నియమితులయ్యారు. ప్రస్తుతం అయన అదే కంపెనీ సి ఈ ఓ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో నాదెళ్ళ నియమితులయ్యారు.

ప్రవాస భారతీయుడు, అందునా మన తెలుగు తేజం సత్య నాదెళ్ళ కు ఈ హోదా దక్కడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం. సి ఈ ఓ హోదాలో భారత దేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీ విస్తరణకు అయన కృషి చేశారు. ఇప్పుడు చైర్మన్ హోదాలో మరింతగా మన దేశంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని సాఫ్ట్ వేర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2014 లో స్టీవ్ బల్మార్ స్థానంలో అయన సి ఈ ఓ గా బాధ్యతలు చెప్తారు. ఈ ఏడేళ్ళలో అయన మైక్రో సాఫ్ట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్