Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్పంజాబ్ పై రాజస్థాన్ విజయం

పంజాబ్ పై రాజస్థాన్ విజయం

RR goes on : ఐపీఎల్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లతో విజయం సాధించింది. గెలుపు కోసం రాజస్థాన్ కు చివరి ఓవర్లో 8 పరుగులు కావాల్సిన దశలో హెట్ మెయిర్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 41బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు సాధించి గెలుపుకు బాటలు వేశాడు.

ముంబై లోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో-56; జితేష్ శర్మ-38; భానుక రాజపక్ష-27; లివింగ్ స్టోన్-22 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5  వికెట్లకు 189 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ మూడు; రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు.

రాజస్థాన్ 46 పరుగుల వద్ద తొలి వికెట్ (జోస్ బట్లర్-30) కోల్పోయింది. కెప్టెన్ సంజూ శామ్సన్-23; దేవదత్ పడిక్కల్-31 పరుగులు చేశారు. చివర్లో హెట్ మెయిర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31  పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

యశస్వి జైస్వాల్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ముంబై అద్భుత విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్