అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని రిచ్మండ్లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం హ్యూగెనాట్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. అనంతరం స్కూలు సమీపంలో ఉన్న మన్రో పార్కులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో 18, 36 ఏండ్ల వయస్కులు ఉన్నట్లు వర్జీనియా సిటీ పోలీస్ చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.