Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్అల్ ఇంగ్లాండ్ ఓపెన్: సింధు, నైనా గెలుపు

అల్ ఇంగ్లాండ్ ఓపెన్: సింధు, నైనా గెలుపు

All England Open: ఇంగ్లాండ్ ఓపెన్ -2022లో తొలిరోజు ఇండియాకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ లో పివి సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సెండ్ లు విజయం సాధించారు.

మహిళల సింగల్స్ లో
పివి సింధు 21-18; 21-13 తేడాతో  చైనా క్రీడాకారిణి వాంగ్ ఝీ పై గెలుపొందింది
సైనా నెహ్వాల్ 21-17; 21-19 తో స్పెయిన్ క్రీడాకారిణి బీట్రిజ్జ్ కోర్రల్స్ పై విజయం సాధించింది.
ఆకర్షి కాశ్యప్ 21-18; 21-18తో కెనడాకు చెందిన మిచేల్లీ లీ  చేతిలో ఓటమి పాలైంది.

పురుషుల సింగల్స్ లో
లక్ష్య సేన్ మన దేశానికే చెందిన  సౌరభ్ వర్మపై 21-17; 21-7 తో విజయం సాధించాడు.
కిడాంబి శ్రీకాంత్ 21-18; 21-14తో థాయ్ లాండ్ ఆటగాడు కాంటఫోన్ పై విజయం సాధించాడు.
హెచ్ ఎస్ ప్రన్నోయ్ పై 21-15; 24-22తో థాయ్ లాండ్ ఆటగాడు కున్లావుట్ గెలుపొందాడు.
సమీర్ వర్మ 21-18; 21-11తో నెదర్లాండ్స్ కు చెందిన మార్క్ కల్జోవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు
సాయి ప్రణీత్ 22-20;21-11 తేడాతో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్ సేన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
పారుపల్లి కాశ్యప్ పై 21-11; 21-18 తో  ఇండోనేషియా ఆటగాడు అంటోనీ గిన్టింగ్  గెలుపొందాడు

పురుషుల డబుల్స్ లో..
సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం 21-17; 21-19తో స్కాట్లాండ్ జోడీపై విజయం సాధించారు
కృష్ణ ప్రసాద్ గరగ- విష్ణువర్ధన్ గౌడ్ జోడీపై జర్మనీ జంటచేతిలో 21-16;21-19 తేడాతో ఓడిపోయారు.
ఎమ్మార్ అర్జున్, ధృవ్ కపిల జోడీ  – ఇండోనేషియాకు చెందిన జోడీ చేతిలో 15-21;21-12;21-18తో ఓడిపోయారు

మహిళల డబుల్స్ లో..
జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీ 17-21; 22-20; 21-14 తేడాతో థాయ్ లాండ్ జోడీపై గెలుపొందారు
జక్కంపూడి మేఘన- రాం పూర్విష జోడీపై 21-5; 21-3తో థాయ్ లాండ్ జోడీ గెలుపొందారు
అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి జోడీపై 21-9; 21-13 తో జపాన్ జోడీ గెలుపొందారు

మిక్స్డ్ డబుల్స్ లో
ఇషాన్ భట్నాగర్- తానీషా ద్వయం ఇండోనేషియా జోడీ చేతిలో 21-14; 21-13తో  ఓటమి పాలయ్యారు
ఎమ్మార్ అర్జున్-త్రీసా జాలీ జంట ఫ్రెంచ్ ఆటగాళ్ళ చేతిలో 21-9;21-18తో ఓటమి పాలయ్యారు.
వెంకట్ గౌరవ ప్రసాద్ -జూహీ దేవంగాన్  జోడీ మలేషియా జంట చేతిలో 21-9, 21-13తో ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్