Tuesday, April 16, 2024
Homeస్పోర్ట్స్కొరియా ఓపెన్: తొలి రౌండ్లో సింధు, శ్రీకాంత్ విజయం

కొరియా ఓపెన్: తొలి రౌండ్లో సింధు, శ్రీకాంత్ విజయం

Korea Open: కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ లో విజయం సాధించారు. సింధు తన ప్రత్యర్థి, అమెరికా క్రీడాకారిణి లారెన్ లామ్ పై 21-15;21-14 తేడాతో విజయం సాధించింది. శ్రీకాంత్ 22-20; 21-11 తేడాతో మలేషియా ఆటగాడు ల్యూ డారెన్ పై గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్, ధృవ్ జంట రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సౌత్ కొరియా క్రీడాకారులు తప్పుకోవడంతో వారు నేరుగా తర్వాతి రౌండ్ లోకి వెళ్ళారు.

మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని పొన్నప్ప- సుమిత్ రెడ్డి జోడీ ­21-19; 21-18 తేడాతో సింగపూర్ ద్వయం జున్ లియాంగ్-యుజియా జిన్ పై గెలుపొందారు.

పురుషుల డబుల్స్ మరో మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం సౌత్ కొరియా జోడీ తేయాంగ్ సిన్-వాంగ్ చాన్ పై 21-16;21-15 తేడాతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు.

మహిళల సింగిల్స్ లో కుదరవల్లి శ్రీకృష్ణ ప్రియ సెకండ్ ర్యాంక్ క్రీడాకారిణి సౌత్ కొరియాకు చెందిన అన్ సెయాంగ్ చేతిలో 21-5;21-13 తేడాతో ఓటమి పాలైంది.

Also Read : కొరియా ఓపెన్: మాళవిక, లక్ష్యసేన్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్