Friday, March 29, 2024
Homeజాతీయంకోవిడ్ వారియర్ల కుటుంబాలకు పరిహారం : స్టాలిన్

కోవిడ్ వారియర్ల కుటుంబాలకు పరిహారం : స్టాలిన్

కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన 43 మంది వైద్య సిబ్బంది కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పారు.

కోవిడ్ నియత్రణ కోసం కష్టపడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్… డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటరీ సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్.. మూడు నెలలపాటు ఈ ప్రోత్సాహకం అందిస్తామని వివరించారు.

డాక్టర్లకు రూ.౩౦ వేలు, నర్సులు, ట్రైని డాక్టర్లకు 20 వేలు, సానిటరీ వర్కర్లు, స్కానింగ్, అంబులెన్సు సిబ్బందికి 15 వేలు ఇస్తామని, కోవిడ్ విధులు నిర్వర్తిసున్న మెడికల్ పిజి విద్యార్ధులకు కూడా 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్