Friday, March 29, 2024
Homeసినిమాసుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ప్రారంభం

సుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ప్రారంభం

‘100 ప‌ర్సెంట్ ల‌వ్’, ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘గీత‌గోవిందం’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ తదితర బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని నిర్మించిన జీఏ2పిక్చ‌ర్స్ తాజాగా ఓ చిత్రాన్ని ప్రారంభించింది. వినూత్న‌మైన క‌థ‌ల్ని, నూత‌న ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హించే క్ర‌మంలో భాగంగా రియలిస్టిక్ సినిమాల్ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌ వెంక‌టేశ్ మ‌హా స‌మ‌ర్ప‌కుడిగా క‌ల‌ర్ ఫొటో ఫేమ్ సుహాస్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. ఈ సినిమాను జీఏ2పిక్చ‌ర్స్ వారు స్వేచ్ఛ క్రియేష‌న్స్ తో క‌లిసి నిర్మిస్తున్నారు.

యువ నిర్మాత ధీర‌జ్ మోగిలినేని ఈ సినిమాను నూత‌న ద‌ర్శ‌కుడు ధుశ్యంత్ క‌టిక‌నేనితో రూపొందిస్తున్నారు. క‌ల‌ర్ ఫొటో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సుహాస్ ఈ సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధం అవుతున్నారు. హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో జ‌రిగిన ఈ సినిమా పూజాకార్య‌క్ర‌మానికి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ హాజ‌రై క్లాప్ కొట్టారు. అనంత‌రం ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు స్క్రిప్ట్ ను అంద‌జేశారు. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిప‌ల్లి కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర నిర్మాత ధీజ‌ర్ మోగిలినేని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్