Thursday, May 9, 2024
HomeTrending Newsటిడిపి రైతు పోరుబాట: చంద్రబాబు

టిడిపి రైతు పోరుబాట: చంద్రబాబు

రేపటి (సెప్టెంబర్ 14) నుంచి 18 వరకు  జోనల్ వారీగా రైతు కోసం పోరుబాట కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. పెట్టుబడి వ్యయం రెట్టింపు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట పొలాలు కౌలు చేసుకునే పరిస్థితులు కూడా లేవని పేర్కొంటూ టిడిపి ఆందోళన బాట పట్టింది. రైతులకు ఇచ్చే సబ్సీడీలు నిలిచిపోయాయని పేర్కొంది.  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. పార్టీ పలు అంశాలపై చర్చించింది. వాటిలో ముఖ్యాంశాలు:

  • రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడింది. దీంతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. రైతులకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు.
  • ఏపీ రైతుల సగటు రైతు కుటుంబ రుణభారం రూ.2.5 లక్షలు దాటి దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. జగన్ రైతు వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనం
  • కరెంట్ ఛార్జీల పెంపుతో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రొయ్యలు, చేపల చెరువుల రైతుల వద్ద కూడా ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
  • ప్రభుత్వమే మటన్, చేపల షాపులు నిర్వహిస్తుందన్న ప్రభుత్వ వ్యవహారశైలి హాస్యాస్పదం, ఇది కులవృత్తులను దెబ్బతీసే చర్య
  • ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాం
  • చట్టాలను ఉల్లంఘించే పోలీసులు, ఇతర అధికారులను భవిష్యత్ లో వదిలిపెట్టకూడదు,  ప్రైవేటు కేసులు పెట్టాలని నిర్ణయం
  • రేషన్, పెన్షన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపులు కొడుతున్నది. తొలగించిన రేషన్, పెన్షన్ల పునరుద్ధరణ కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగించాలి
  • వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువగా ఉన్న విషయాన్ని గమనించాలి. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ప్రాణాల పట్ల జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయం
  • ఫైబర్ గ్రిడ్ లో రూ.2 వేల కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఖర్చు చేసిందే రూ.307 కోట్లు కాగా.. అందులో రూ.2 వేల కోట్లు ఎలా అవినీతి జరుగుతుంది?
  • పంచాయతీల్లో కూడా ఆస్తిపన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ మోహన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం
  • కడప జిల్లాలో అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ‌ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం మైనార్టీలకు చేసిన ద్రోహం
  • పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని సమావేశం అభిప్రాయపడింది.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య,  కాలవ శ్రీనివాసులు, బండారు సత్యనారాయణ మూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమా మహేశ్వరరావు, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  బీసీ జనార్థన్ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్