Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్పాట్నా జోరు; టైటాన్స్ కు దక్కని విజయం

పాట్నా జోరు; టైటాన్స్ కు దక్కని విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ నేటి మ్యాచ్ ల్లో పాట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది. మరో మ్యాచ్ లో గుజరాత్ గెలుపొందింది.

పాట్నా పైరేట్స్- యూ ముంబా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 43-23 తో పాట్నా విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 19-9 తో ఆధిక్యం సంపాదించిన పాట్నా రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కొనసాగించి 24-14 తో పైచేయి కొనసాగించింది. మ్యాచ్ ముగిసే నాటికి 20 పాయింట్ల భారీ తేడాతో పాట్నా గెలుపొందింది.

గుజరాత్ జెయింట్స్- తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో గుజరాత్ 40-22 తేడాతో  విజయాన్ని అందుకుంది. తొలి అర్ధ భాగంలో గుజరాత్ 20-13 తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ టైటాన్స్ ను నిలువరించి 20-9తో పైచేయి సాధించి మొత్తంగా 18 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత పాట్నా పైరేట్స్ (34 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (32); బెంగుళూరు బుల్స్ (28); తమిళ్ తలైవాస్ (27); యూ ముంబా(25); జైపూర్ పింక్ పాంథర్స్ (23) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్