Wednesday, April 17, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  తెలుగు టైటాన్స్ కు మరో ఓటమి

ప్రొ కబడ్డీ:  తెలుగు టైటాన్స్ కు మరో ఓటమి

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ మరో ఓటమి పాలై అభిమానులను నిరాశపరిచింది.  నేడు జరిగిన మ్యాచ్ ల్లో యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్ విజయం సాధించాయి.

దబాంగ్ ఢిల్లీ – యూపీ యోధ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 37-33తో  ఢిల్లీ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో యూపీ 18-13 తో ఆధిక్యం సంపాదించినా రెండో అర్ధ భాగంలో ఢిల్లీ పుంజుకుని 24-15 తో పైచేయి సాధించి చివరకు నాలుగు పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 18 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

యూ ముంబా – తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో ముంబాయి 48-38 తో ఘనవిజయం సాధించింది. తొలి అర్ధ భాగంలోనే ముంబై 28-13తో 15 పాయింట్ల భారీ ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్ ధాటిగా ఆడి 25-20 తో ఆధిక్యం సంపాదించినా మొదటి అర్ధభాగంలో ముంబై సాధించిన భారీ ఆధిక్యాన్ని దాటలేకపోయింది. దీనితో 10 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. యూ ముంబా ఆటగాడు అభిషేక్ సింగ్ 13  పాయింట్లతో రాణించాడు.

పాట్నా పైరేట్స్ – గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో పాట్నా 27-26 తో  విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో పాట్నా 15-13 తో స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధ భాగంలో గుజరాత్ 13-12 తో అతి స్వల్ప ఆధిక్యం సంపాదించింది.  చివరివరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఒక పాయింట్ తేడాతో పాట్నా విజయం దక్కించుకుంది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (31 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (29); బెంగుళూరు బుల్స్ (28); యూ ముంబా(25); తమిళ్ తలైవాస్ (22); హర్యానా స్టీలర్స్ (20) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్