Saturday, September 21, 2024
HomeTrending Newsజెరూసలేంలో ఉగ్రవాది కాల్పులు... ఏడుగురు మృతి

జెరూసలేంలో ఉగ్రవాది కాల్పులు… ఏడుగురు మృతి

ఇజ్రాయెల్‌లోని జెరూసలేం కాల్పుల మోతతో దద్దరిల్లింది. జెరూసలేంలోని నెవ్‌ యాకోవ్‌ బౌలేవార్డ్‌లోని యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు నెవ్‌ యాకోవ్‌ బౌలేవార్డ్‌లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద ఉగ్రవాది కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

అటు శుక్రవారం ఉదయం పాలస్తీనాలోని గాజా ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ సైనికులు దాడిచేశారు. దీంతో ఓ వృద్ధురాలు సహా 10 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. టెర్రరిస్టుల కార్యకలాపాలను నిలువరించడానికే దాడులు చేపట్టామని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్