Friday, March 29, 2024
HomeTrending NewsMaharashtra: రాయ‌గ‌డ్ లో బస్సు ప్రమాదం...12 మంది మృతి

Maharashtra: రాయ‌గ‌డ్ లో బస్సు ప్రమాదం…12 మంది మృతి

మ‌హారాష్ట్ర‌లోని రాయ‌గ‌డ్ జిల్లాలోని ఓ కాలువ‌లో బ‌స్సు ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. మ‌రో 25 మంది గాయ‌ప‌డ్డారు. ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. పుణె నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేటు బ‌స్సు కోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్ర‌మాదానికి గురైంది. ముంబై-పుణె పాత హైవేపై ఉన్న శిన్‌గ్రోబా ఆల‌యం స‌మీపంలోని లోయ‌లో బ‌స్సు ప‌డింది.

ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 45 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. గాయ‌ప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. గోరేగావ్‌లోని ఓ సంస్థ‌కు చెందిన ఉద్యోగులు అంతా పుణెకు వెళ్లి తిరుగు ప్ర‌యాణం అవుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్