Our work will speak: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం ‘ఖిలాడీ’. కోనేరు సత్య నారాయణ నిర్మించిన ఈ సినిమా లో డింపుల్ హయాతి, మీనాక్షిచౌదరి హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్. హవీష్ ప్రొడక్షన్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. బిగ్ టిక్కెట్ను బాబీ ఆవిష్కరించారు.
ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ “మొదటిసారి అనసూయ, అర్జున్ గారితో నటించాను. అర్జున్ గారి ఇన్స్పిరేషన్. సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నీషియన్స్ సుజిత్ వాసుదేవన్ అద్భుతంగా చేశాడు. సెకండాఫ్లో చాలా సీన్స్ హైలైట్గా వుంటాయి. ఈ సినిమా అందంగా చూపించారంటే కారణం జికె విష్ణు గారే. ఈ సినిమా కొత్త కొత్త టెక్నీషియన్తో పని చేశాను. నేను జాతకాన్ని, అదృష్టాన్ని నమ్మను. కష్టాన్ని నమ్ముతా. ఏదో ఒక శాతం అది వుంటుంది. అయితే.. రమేష్వర్మను చూస్తే జాతకం, అదృష్టం రెండూ కలిసి వచ్చాయనిపిస్తుంది. నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు అందరినీ ప్రొవైడ్ చేయడమే కాకుండా మొన్ననే రమేష్కు కారును బహూకరించారు. అందుకే రమేష్ వర్మ మహర్జాతకుడు.
‘రాక్ స్టార్’ తో గ్యాప్ వచ్చింది. ఇక నుంచి రాదు. ‘ఖిల్ ఖిలాడి’ సాంగ్.. నా ఫేవరేట్. ముందుగా ఈ సినిమా 18 అనుకున్నాం. కానీ అన్నీ పనులు త్వరగా అయ్యాయి. నేను మీలో ఒక్కడిగా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుంది. ఈ సినిమా క్రెడిట్ దక్కాలంటే అది టెక్నీషియన్కే దక్కుతుంది. ఈ సినిమా హీరోయిన్లు పెద్ద స్టార్ గా అవుతారనే నమ్మకం వుంది. ఇక సాగర్ హ్యూమర్ గా డైలాగ్లు రాశాడు. నేను ఈ సినిమా చేయడానికి కారణం శ్రీకాంత్ విస్సా. తను వున్నాడనే చేశాను. అలాగే తర్వాత కోనేరు గారు మరో కారణం. అందరూ మాస్క్ ధరించి సినిమా చూడండి. జై సినిమా” అంటూ ముగించారు.