Friday, April 19, 2024
HomeTrending Newsఈ ఏడూ పదిరోజుల వైకుంఠ దర్శనం: టిటిడి

ఈ ఏడూ పదిరోజుల వైకుంఠ దర్శనం: టిటిడి

Vaikuntha Darshan:
గత ఏడాదిలాగే ఈఏడు కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నేడు టిటిడి పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాన్ని రోడ్డుమార్గంగా అభివృద్ధి పరచాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

టిటిడి బోర్టు నిర్ణయాలు:

⦿ జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం, పది రోజులపాటు వైకుంఠ దర్శనం
⦿ కోవిడ్ నిబంధనలు సడలిస్తే, సంక్రాంతి పండుగ తరువాత సర్వదర్శనం కోటా పెంపు
⦿ ఆర్జిత సేవలలో భక్తులకు అనుమతి
⦿ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతి
⦿ ప్రస్తుతం ఖాళీగా వున్న 500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు వాటిని భక్తులకు కేటాయింపు
⦿ పాలకమండలి సభ్యులు నుంచి కూడా కొంతమంది విరాళాలు అందించేందుకు అంగీకారం
⦿ టిటిడి ద్వారా 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్సలు
⦿ హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి ప్రాంతం అభివృద్ధి
⦿ నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండప నిర్మాణం
⦿ హిందు ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు
⦿ వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాల పునః నిర్మాణం
⦿ ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు
⦿ 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాల కొనుగోలు
⦿ శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులకు అనుమతి
⦿ తాళ పత్ర గ్రంధాలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగం ఏర్పాటు
⦿ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం
⦿ భక్తులకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాల పంపిణీ
⦿ కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంపు
⦿ 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్ల ఏర్పాటు
⦿ 10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాల నిర్మాణం
⦿ 12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హాస్టల్ భవనాల నిర్మాణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్