Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: యూపీ విజయం, టైటాన్స్ దురదృష్టం

ప్రొ కబడ్డీ: యూపీ విజయం, టైటాన్స్ దురదృష్టం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో పూణేపై యూపీ విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.

యూపీ యోధ – పునేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 50-40 తో యూపీ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 20-20 తో రెండు జట్లూ సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలోనూ రెండు జట్లూ హోరాహోరీ తలపడ్డాయి. అయితే యూపీ సత్తా చాటి 30-20తో ముందజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి యూపీ 10 పాయింట్లతో విజయం సొంతం చేసుకుంది. యూపీ ఆటగాడు సురేందర్ గిల్ 21 పాయింట్లు సంపాదించి విజయంలో కీలక భూమిక వహించాడు.

తెలుగు టైటాన్స్- బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో బెంగాల్ 28-27 తేడాతో గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో బెంగాల్ 14-13 తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ సత్తా చాటి హోరాహోరీ తలపడింది. చివరి నాలుగు నిమిషాల వరకూ విజయం నీదా-నాదా అన్నట్లు సాగింది. బెంగాల్ చివర్లో సత్తా చాటి 14-14 తో సమంగా నిలిచింది. దీనితో ఒక్క పాయింట్ తేడాతో బెంగాల్ ను విజయం వరించింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు బుల్స్ (39 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (39); దబాంగ్ ఢిల్లీ (37); యూపీ యోధ (33); జైపూర్ పింక్ పాంథర్స్ (31); తమిల్ తలైవాస్ (30); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్