వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ తదితరులు నటించనున్న చిత్రం ‘ఆద్య’. శ్రీసత్యసాయిబాబా వారి ఆశీస్సులతో P.S.R. కుమార్ (బాబ్జి, వైజాగ్), S. రజినీకాంత్ నిర్మాతలుగా శ్రీసాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ చిత్రం రూపొందబోతోంది. డిఎస్కే స్క్రీన్ సమర్పణలో ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆద్య’. జనవరి 11 నుంచి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం `షికారు` త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ద్వితీయ చిత్రం`ఆద్య. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బ పటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా, సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
Also Read : రాజ’శేఖర్’లో శివానీ రాజశేఖర్