Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్IPL: అయ్యర్ సెంచరీ వృథా: కోల్ కతాపై ముంబై గెలుపు

IPL: అయ్యర్ సెంచరీ వృథా: కోల్ కతాపై ముంబై గెలుపు

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. ముంబై ఆటగాళ్ళు ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్  ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చి సత్తా చాటారు.  కోల్ కతా బ్యాట్స్ మెన్ వెంకటేష్ అయ్యర్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 పరుగులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతాలో వెంకటేష్ అయ్యర్ (104); ఆడ్రీ రస్సెల్  (21); రింకూ సింగ్ (18) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  ముంబై బౌలర్లలో హ్రితిక్ షోకీన్ రెండు; కామెరూన్ గ్రీన్, డుయన్ జాన్సెన్, పియూష్ చావ్లా, మెరెడిత్ తలా ఒక వికెట్ సాధించారు.

లక్ష్య ఛేదనలో ముంబై తొలివికెట్ (కెప్టెన్ రోహిత్ 20) కు 65 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ వేగంగా ఆడి 25 బంతుల్లో  5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 రన్స్ సాధించి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. గత మూడు మ్యాచ్ లలో ఘోరంగా విఫలమైన సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43; తిలక్ వర్మ 25బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్ తో 30 పరుగులు చేసి ఔట్ కాగా… నేహాల్ వాధేరా (6) విఫలమయ్యాడు. టిమ్ డేవిడ్ 24 (13బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు); గ్రీన్ ఒక పరుగుతో నాటౌట్ గా నిలిచారు. 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.

కోల్ కతా బౌలర్లలో సుయాష్ శర్మ 2; శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, ఫెర్గ్యుసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

వెంకటేష్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్