Friday, October 18, 2024
HomeTrending Newsహై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ

హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ

హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ తీర్చి దిద్దుతున్నామని దావోస్‌ వేదికగా విఖ్యాత కంపెనీలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు సీఎం ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్‌ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్‌ మహీంద్ర అంగీకారం తెలిపింది. ఏపీలో రూ.250 కోట్లతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ పెడుతున్న అసాగో. ఏపీలో షిప్పింగ్, లాజిస్టిక్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నామని ప్రకటించిన మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌

1.
దావోస్‌ :ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానితో సీఎం భేటీ.
విశాఖపట్నంలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై సమావేశంలో చర్చ.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక స్కిల్‌ యూనివర్శిటీతోపాటు, 30 స్కిల్‌కాలేజీలు, వీటికి అదనంగా మరో 175 స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటుచేస్తున్నామని తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి వీటితో అనుసంధానం కావాలని కోరిన సీఎం విద్యార్థులకు మరింత నైపుణ్యం వచ్చేందుకు వీలుగా ఇంటర్న్‌షిఫ్, అప్రెంటిషిప్‌ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో ఇథనాల్‌ తయారీకి రూ.250 కోట్ల పెట్టుబడితో ప్లాంటు పెడతామని ప్రతిపాదించిన మహీంద్ర subsidiary కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన సీఎం.

టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో మంచి సమావేశం జరిగిందని, విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని ఆయన సంకల్పంతో ఉన్నారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగారి విజ్ఞప్తి మేరకు ఆంధ్రా వర్శిటీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం.
నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తాం.

2.
ఆ తర్వాత దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం భేటీ. త్రీడీ సంబంధిత ఉత్పత్తులను అందిస్తున్న ఫ్రెంచ్‌ సాఫ్ట్‌వేర్‌కంపెనీ ఇది. 140 దేశాల్లో 20వేలమందికిపైగా ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంపై చర్చించిన సీఎం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు అందించడానికి సైన్స్‌ బేస్డ్‌ టార్గెట్స్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీలో భాగస్వామ్యం కావాలని చెప్పారు. పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా తగిన సహకారం అందించాలన్న సీఎం. సీఎం ప్రతిపాదనలపై సానుకూలత తెలిపిన దస్సాల్ట్‌ సిస్టమ్స్‌.
త్వరలో ఏపీలో పర్యటిస్తామని వెల్లడించిన ఫ్లోరెన్స్‌.

దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రితో చక్కటి సమావేశం జరిగింది. నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై మా సమావేశంలో చర్చ జరిగింది. స్మార్ట్‌ పోర్టులు, కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఏపీతో భాగస్వామ్యానికి దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఉత్సాహంగా ఉంది.

3. అటు పిమ్మట స్విస్‌ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ. భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌ బృందంతో సీఎం సమావేశం. ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించిన బృందం.

4.
ఏపీ పెవిలియన్‌లో మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెశిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ. టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపుగా 10.3 బిలియన్‌ డాలర్లు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులను పూర్తిచేసి తద్వారా ఏడాదికి 507 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించిన అధికారులు. కంటైనర్‌ హబ్, లాజిస్టిక్‌ రంగాలపై దృష్టిపెట్టాలని కోరిన సీఎం. సీఎం ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తంచేసిన హషిమొటో. కాకినాడలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొస్తున్నామని వెల్లడి.

ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెశిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో మాట్లాడుతూ… షిప్పింగ్, లాజిస్టిక్స్‌ వ్యాపార రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చించాం. ఏపీకి గొప్ప అవకాశాలున్నాయి. మేం కూడా మా వ్యాపారాన్ని విస్తరించడానికి మాకు అవకాశం కలుగుతోంది. మేం భారత్‌లో పూర్తిస్థాయి కంపెనీని పెట్టాం.  ఏపీలో ఈ కంపెనీద్వారా మా వ్యాపారాన్ని విస్తరిస్తాం. ఏపీకి పొడవైన తీరప్రాంతం ఉంది. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయి.

5.
సీఎంను కలుసుకున్న హీరో గ్రూప్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చలు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తిచేస్తున్న అథెర్‌ ఎనర్జీలో ఇప్పటికే 36శాతం వాటాను కొనుగోలుచేసిన హీరో గ్రూప్‌. బ్యాటరీ టెక్నాలజీలో తైవాన్‌కు చెందిన గగొరో కంపెనీతో హీరో గ్రూప్‌కు భాగసామ్యం. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలు. విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లో భాగంగా పరిశ్రమలకు నీటివనరులను అందించే పనుల్లో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి అవసరమైన నీటిని కండలేరు నుంచి ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్