Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్WPL: బెంగుళూరుపై ముంబై విజయం

WPL: బెంగుళూరుపై ముంబై విజయం

విమెన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై ముంబై 4 వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో ఇరు జట్లూ తమ లీగ్ మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. మొత్తం 8 మ్యాచ్ ల్లో ముంబై 6 విజయాలు, 2 పరాజయాలతో  ప్లేఆఫ్స్ కు అర్హత సంపాదించగా…. బెంగుళూరు 2 విజయాలు, 6 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పరుగుల వేటలో బెంగుళూరు మరోసారి తడబడింది. ఎల్లిస్ పెర్రీ-29; రిచాఘోష్-29; స్మృతి మందానా- 24.. మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్ 3; నటాలి స్కివర్ బ్రంట్, ఇస్సీ వాంగ్ చెరో 2; సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ముంబై తొలి వికెట్ కు 53 రన్స్ సాధించింది. యస్తికా భాటియా-24; హేలీ మాథ్యూస్-30; స్కివర్ బ్రంట్-13;  హర్మన్-2; పూజా వస్త్రాకర్-19 పరుగులు చేసి ఔటయ్యారు. అమేలియా 31 రన్స్ తో నాటౌట్ గా నిలిచి రాణించింది. 16.3ఓవర్లలోనే విజయం దక్కింది.

బెంగుళూరు బౌలర్లలో కనిక అహుజా 2; మేగాన్ స్కట్, శ్రేయాంకా పాటిల్, ఎల్లిస్ పెర్రీ, ఆశా శోభన తలా ఒక వికెట్ పడగొట్టారు.

అమేలియా కెర్ర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్