Saturday, July 27, 2024
HomeసినిమాYash: యశ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

Yash: యశ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

కేజీఎఫ్ మూవీ ఓ సంచలనం. ఆతర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 మరో సంచలనం. ఈ రెండు చిత్రాలతో హీరో యశ్, ప్రశాంత్ నీల్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. యశ్ మాత్రం నెక్ట్స్ ఏంటి..? అనేది ప్రకటించలేదు. కేజీఎఫ్ 2 సినిమా పూర్తై సంవత్సరం అయ్యింది కానీ.. యశ్ మాత్రం తదుపరి చిత్రం ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. అభిమానులు ఎప్పుడెప్పుడు యశ్ కొత్త సినిమాని అనౌన్స్ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో యశ్ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ.. అందులో నిజం లేదని తెలిసింది. ఆతర్వాత దిల్ రాజు బ్యానర్ లో యశ్ మూవీ ఉంటుందని టాక్ వచ్చింది కానీ.. ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. దీంతో యశ్ ఎవరితో సినిమా చేయనున్నాడు..? ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు..? అని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే… తాజాగా యశ్  ఓ లేడీ డైరెక్టర్ తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.? అనేది హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ ఎవరా లేడీ డైరెక్టర్ అంటే… గీతూ మోహన్ దాస్. ఒకప్పుడు హీరోయిన్ గా పలు మలయాళ సినిమాల్లో నటించిన గీతూ ఆ తర్వాత దర్శకురాలిగా మారారు. ఆమె భర్త రాజీవ్ రాయ్ ఫేమస్ కెమెరామెన్. అలాగే దర్శకుడు కూడా. ఆమె డైరెక్టర్ గా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు తీశారు. తన మూడో చిత్రం కోసం యశ్ ని  సంప్రదించడం, ఆమె చెప్పిన కథ నచ్చడంతో ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే… యశ్ ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన శంకర్, రాజమౌళి రేంజ్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తాడని అనుకుంటే.. గీతూకి ఎలా ఓకే చెప్పారు అనేది అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్