Friday, October 18, 2024
HomeTrending News8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట - వైఎస్ షర్మిల

8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట – వైఎస్ షర్మిల

కేసీఅర్ కి కేవలం ఓట్ల తోనే పని అని ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్లు గుద్ధించుకొని మళ్ళీ ఫామ్ హౌజ్ కి వెళ్ళిపోతాడన్నారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… తెలంగాణ ఖజానాను కెసిఆర్ పూర్తిగా కొల్లగొట్టాడని ఆరోపించారు. ప్రాజెక్ట్ ల పేరుతో కమీషన్ల రూపంలో సంపద దోచేశారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు. కేసీఅర్ ను మళ్ళీ నమ్మితే తెలంగాణను అమ్మెస్తాడని హెచ్చరించారు. ఇప్పటి వరకు కేసీఅర్ అరచేతిలో వైకుంఠం చూపించారని, కేసీఅర్ కి అసలు పరిపాలన చేతకాదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ ఉండడు. మన దరిద్రం కొద్ది మనకే ఉన్నాడని మండిపడ్డారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, తెలంగాణలో రైతాంగం పూర్తిగా ఆగం అవుతుందన్నారు.

కెసిఆర్ ఏలుబడిలో 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కోటేశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..? బంగారు తెలంగాణలో రైతు 59 ఏళ్లకే చనిపోవాలట…కేసీఅర్ మాత్రం బాగా బ్రతకాలి…రాజ్యాలు ఏలాలి. రైతు మాత్రం రైతు బీమా కావాలి అంతే 59 ఏళ్లకే చనిపోవాలట. బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు. ఇక్కడ చేసింది ఏమి లేదు కానీ…ఇప్పుడు కేసీఅర్ దేశం మీద పడ్డాడని విమర్శించారు. BRS పార్టీ పెట్టాడు… ప్రధాన మంత్రి అవుతా అంటున్నాడు. అమ్మకు అన్నం పెట్టడు కానీ…పిన్నమ్మ కి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణలో కనీసం హాస్టళ్లలో మంచి బొజనం పెట్టే పరిస్థితి లేదన్నారు.

8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరు కూడా మెదపడం లేదని షర్మిల అన్నారు.  ఎవరి రాజకీయాలు వారివే…అన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి అవినీతి చేస్తుంటే…బీజేపీ,కాంగ్రెస్ లు ప్రశ్నించలేదు. అన్ని ప్రాజెక్ట్ లు మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఎందుకు ఇస్తున్నవు అని అడగలేదు. మెగా నుంచి బీజేపీ,కాంగ్రెస్ కి వాటాలు వస్తాయి కాబట్టి నోరు మెదపరు. అసలు తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడే పార్టీలు లేనే లేవు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు పార్టీ పెట్టాం.  వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా అని షర్మిల భరోసా ఇచ్చారు.

Also Read : కెసిఆర్.. మెగా కృష్ణారెడ్డి తోడుదొంగలు: వైఎస్ షర్మిల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్