Friday, March 29, 2024
HomeTrending Newsబడ్జెట్ : రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

బడ్జెట్ : రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

2022 Budget : ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభివర్ణించారు. బడ్జెట్‌ 2022-23ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో  టీకా కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఆరోగ్యరంగంలో మౌలిక సౌకర్యాలు.. టీకాలు.. ఆర్థిక రంగ విస్తరణలో కీలక పాత్ర పోషించాయి. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం బదలాయించింది. త్వరలోనే ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకొస్తాం. 2021-22లో ఆర్థికంగా కోలుకున్నాం. ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది నాలుగోసారి. కేంద్ర బ‌డ్జెట్‌ను కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్‌తో భేటీ అయి.. బ‌డ్జెట్ విష‌యాల‌ను వివ‌రించారు.

పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది

పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే 25ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుంది. నీలాంచల్‌ నిస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రైవేటుపరం చేశాం. వచ్చే ఐదేళ్లలో 13లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు.

100 వందే భారత్‌ రైళ్లు: నిర్మలా సీతారామన్‌

రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ధి. మేకిన్‌ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు.100 వందే భారత్‌ రైళ్లు. 100 గతిశక్తి టెర్మినల్స్‌. వచ్చే 25ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపకల్పన. జాతీయ రహదారులు మరో 25వేల కి.మీ. విస్తరణ’ చేయనున్నట్లు తెలిపారు.

చిరుధాన్యాల సంవత్సరంగా 2023

2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి పెద్ద పీట వేస్తాం అని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు

7 రంగాలపై దృష్టి

తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత.

డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్య రంగంపై దృష్టిసారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా డిజిటల్‌ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. పీఎం విద్యలో భాగంగా ప్రతి తరగతికి టివి చానెల్ కార్యక్రమాన్ని ఆధునీకరించి అందుకోసం ప్రస్తుతం ఉన్న 12 చానెళ్ళను పెంచి 200 టీవీ ఛానళ్ల ఏర్పాటు. రాష్ట్రా ప్రభుత్వాలు స్థానిక బాషలలో ప్రసారాలు చేసుకునేలా వెసులుబాటు. ఇది ఒకటి నుంచి 12 వ తరగతి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంపు. డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన తదితర అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రి ఈ-విద్య‌లో భాగంగా ఒక్కో త‌ర‌గ‌తికి ఒక్కో ఛాన‌ల్. ఉపాధ్యాయుల‌కు డిజిట‌ల్ నైపుణ్యాల శిక్ష‌ణ‌. విద్యార్థులంద‌రికీ అందుబాటులోకి ఈ – కంటెంట్. డిజిట‌ల్ విద్య అందించే ఉపాధ్యాయుల‌కు అందుబాటులోకి ప్ర‌పంచ‌స్థాయి ఉప‌క‌ర‌ణాలు.

నారీ శక్తికి ప్రాధాన్యం

మహిళా, శిశు సంక్షేమశాఖను పునర్‌ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మిషన్‌ శక్తి, మిషన్‌ వాత్సల్య, మిషన్‌ అంగద్‌ పథకాలు. ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారెంటీ పథకం. ఇందుకోసం  రూ.2లక్షల కోట్ల ఆర్థిక నిధులు కేటాయిస్తున్నామన్నారు.

నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌

* మొదటి సూత్రం-ప్రధాని గతిశక్తియోజన

* రెండో సూత్రం- సమీకృత అభివృద్ధి

* మూడో సూత్రం- అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు

* నాలుగో సూత్రం- పరిశ్రమలకు ఆర్థిక ఊతం

వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపుకోసం స్టార్టప్‌లు

ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్‌ఫాం. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థికసాయం. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు. రెండు లక్షల అంగన్వాడీల ఆధునీకీకరణ. పీఎం ఆవాస్‌ యోజన పథకం ద్వారా 80 లక్షల గృహాల నిర్మాణం చేపడుతామన్నారు.

వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్‌లో మార్పులు

వ్యవసాయ వర్సిటీల్లో ఇప్పటివరకూ ఉన్న సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌, సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. పోస్టాఫీసులను కోర్‌ బ్యాంకింగ్‌లోకి తీసుకొస్తాం. దేశం నలుమూలలకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ విస్తరించేలా చేస్తాం. 5 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అలాగే కాలం చెల్లిన చట్టాల రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

బడ్జెట్ ముఖ్య అంశాలు…

  • రాష్ట్రాల‌కు ఆర్థిక‌సాయంగా రూ. ల‌క్ష కోట్ల నిధి ఏర్పాటు.
  • ప్ర‌త్యేక నిధి ద్వారా రాష్ట్రాల‌కు రూ. ల‌క్ష కోట్ల వ‌డ్డీ లేని రుణాలు.
  • త్వ‌ర‌లో భ‌వ‌నాల ఆధునిక బై లాస్ విడుద‌ల‌.
  • ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక కోసం ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఏర్పాటు.
  • ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీల‌కు రూ. 250 కోట్లు.
  • సుల‌భ‌త‌ర వాణిజ్య ప్రోత్సాహం రెండో ద‌శ ప్రారంభం.
  • 5 విద్యాసంస్థ‌ల‌కు ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీ హోదా.
  • మూల‌ధ‌న పెట్టుబ‌డుల కోసం రాష్ట్రాల‌కు కేంద్ర‌సాయం.
  • దేశ వ్యాప్తంగా మూల‌ధ‌న పెట్టుబ‌డుల కోసం రూ. 10.68 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు.
  • బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్ప‌త్తి కోసం 4 పైల‌ట్ ప్రాజెక్టులు.
  • దేశీయంగా సౌర విద్యుత్ ప్లేట్ల త‌యారీ ప్రోత్సాహ‌కానికి రూ. 19,500 కోట్లు కేటాయింపు.
  • ప్ర‌యివేటు రంగంలో అడ‌వుల ఉత్ప‌త్తి కోసం నూత‌న ప‌థ‌కం.
  • పీఎం ఆవాస్ యోజ‌న‌లో భాగంగా 80 ల‌క్ష‌ల గృహాలు.
  • రూ. 44 వేల కోట్ల‌తో అందుబాటు ధ‌ర‌ల్లో గృహాల నిర్మాణం.
  • ఉత్త‌ర స‌రిహ‌ద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కం.
  • 112 ఏస్పిరేష‌న్ జిల్లాల్లో 95 శాతం వైద్య సౌక‌ర్యాలు మెరుగుప‌డ్డాయి.
  • ర‌క్ష‌ణ రంగంలో ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు అవ‌కాశం.
  • డీఆర్‌డీవో, ఇత‌ర ర‌క్ష‌ణ ప‌రిశోధ‌నా సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు అవ‌కాశం.
  • ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల దిగుమ‌తులు త‌గ్గించి స్వ‌యం స‌మృద్ధి సాధించేలా కృషి.
  • విద్యాసంస్థ‌లు, ప‌రిశోధ‌నా సంస్థ‌లు, ప్ర‌భుత్వ సంస్థ‌ల మ‌ధ్య బ‌ల‌మైన అనుసంధానం.
  • విద్యారంగంలో తొలిసారిగా డిజిట‌ల్ విశ్వ‌విద్యాల‌యాలు.
  • డ్రోన్ శ‌క్తి కార్య‌క్ర‌మంలో భాగంగా అంకుర సంస్థ‌ల‌కు ప్రోత్సాహం.
  • దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5 జీ సాంకేతిక‌త‌.
  • 2022-23లో ప్ర‌యివేటు సంస్థ‌ల ద్వారా 5 జీ సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాం.
  • 2022-23లో ఈ-పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతిక‌త‌.
  • ఇక నుంచి చిప్ ఆధారిత పాస్‌పోర్టులు జారీ.
  • 75 జిల్లాల్లో 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు.
  • కాంట్రాక్ట‌ర్ల‌కు ఈ-బిల్లులు పెట్టుకునే అవ‌కాశం.
  • బిల్లుల వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌక‌ర్యం.
  • ఎగుమ‌తుల వృద్ధికి పారిశ్రామిక సంస్థ‌ల‌కు నూత‌న ప్రోత్సాహ‌కాలు.
  • మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, అభివృద్ధి, వినియోగంపై దృష్టి.
  • గంగా ప‌రివాహం వెంబ‌డి నేచుర‌ల్ ఫార్మింగ్ కారిడార్.
  • మ‌హిళ‌లు, చిన్నారుల అభివృద్ధికి 3 ప్ర‌త్యేక ప‌థ‌కాలు.
  • దేశ వ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేష‌న్ ప‌థ‌కం(ఎన్‌జీడీఆర్ఎస్‌)
  • దేశంలో ఎక్క‌డి నుంచైనా రిజిస్ట్రేష‌న్‌కు నూత‌న వ్య‌వ‌స్థ‌.
  • దేశ వ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేష‌న్ల‌కు ఆధునిక వ్య‌వ‌స్థ‌.
  • ఎంఎస్ఎంఈల రేటింగ్‌కు రూ. 6 వేల కోట్ల‌తో ప్ర‌త్యేక ప‌థ‌కం.
  • పంట‌ల ప‌రిశీల‌న‌, భూమి రికార్డులు, పురుగుల మందు పిచికారికి కిసాన్ డ్రోన్లు.
  • సాగురంగంలో యాంత్రీక‌ర‌ణ‌కు పెద్ద ఎత్తున ప్రోత్సాహం.
  • వ‌రి, గోధుమ కొనుగోళ్లు, మ‌ద్ద‌తు ధ‌ర‌ల కోసం రూ. 2.37 ల‌క్ష‌ల కోట్లు.
  • 1.5 ల‌క్ష‌ల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఏం సేవ‌లు.
  • దేశ వ్యాప్తంగా జిల్లాల వారీ వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ప్ర‌త్యేక అభివృద్ధి ప‌థ‌కం.
  • మ‌హిళా, శిశు సంక్షేమం కోసం మిష‌న్ శ‌క్తి, వాత్స్య‌ల‌, స‌క్షం అంగ‌న్‌వాడీల రూప‌క‌ల్ప‌న‌.
  • గ‌త రెండేళ్ల‌లో న‌ల్ సే జ‌ల్ కింద 5.7 కోట్ల కుటుంబాల‌కు అందుబాటులోకి తాగునీరు.
  • మినిమం, మ్యాగ్జిమం గ‌వ‌ర్న‌మెంట్ ల‌క్ష్యంలో భాగంగా కాలం తీరిన చ‌ట్టాలు ర‌ద్దు.
  • డిజిట‌ల్ చెల్లింపులు, డిజిట‌ల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మ‌రింత ప్రోత్సాహం.
  • పీఎం గ‌తిశ‌క్తిలో భాగంగా 2022-23లో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
  • రూ. 20 వేల కోట్లతో 20 వేల కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
  • మానసిక స‌మ‌స్య‌ల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానానికి రూప‌క‌ల్ప‌న‌.
  • బెంగ‌ళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుంది.
  • చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కోసం ప్ర‌త్యేక క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కం.
  • క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కానికి రూ. 2 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక నిధులు.
  • న‌దుల అనుసంధానానికి 5 డీపీఆర్‌లు సిద్ధం చేశాం.
  • ప్ర‌తి రాష్ట్రంలో కొన్ని ప్ర‌త్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
  • ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన నైపుణ్యాభివృద్ధి కోసం అద‌న‌పు నిధులు, ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌లు.
  • ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవ‌కాశాలు.
  • వంట నూనెల కోసం దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌కుండా దేశీయంగా ఉత్ప‌త్తి.
  • పీపీపీ మోడ‌ల్‌లో ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహం.
  • ర‌సాయ‌న ర‌హిత వ్య‌వ‌సాయ అభివృద్ధికి మ‌రింత ప్రోత్సాహం.
  • సేంద్రీయ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి ప్ర‌త్యేక ప్రోత్సాహం.
  • రైతుల‌కు అద్దె ప్రాతిప‌దిక‌న వ్య‌వ‌సాయం ప‌నిముట్లు ఇచ్చేందుకు ప్ర‌త్యేక క‌థ‌నం.
  • ప‌ర్వ‌త‌మాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి.
  • 60 కిలోమీట‌ర్ల దూరంతో ఒక్కో రోప్‌వే నిర్మాణం.
  • ప‌ర్వ‌త‌మాల ప్రాజెక్టు కింద ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన అభివృద్ధి.
  • కొండ ప్రాంతాల్లో ప‌ర్యాట‌క అభివృద్ధికి త‌గినంత అవ‌కాశాలు.
  • యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులు, ఎస్సీ, ఎస్టీల‌కు ఈ బ‌డ్జెట్ ఊత‌మిస్తుంది.
  • దేశంలో నాలుగు చోట్ల మ‌ల్టీమోడ‌ల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
  • పీఎం గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థకు దిశానిర్దేశం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్