It is up to them: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతినుంచి కర్నూలుకు తరలించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఇరువురూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపాల్సి ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తన సమాధానంలో పేర్కొన్నారు.