Sunday, September 22, 2024
HomeసినిమాNTR-Koratala: ఎన్టీఆర్ మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

NTR-Koratala: ఎన్టీఆర్ మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలిసి సినిమా చేయడం.. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో అభిమానుల్లోనే కాకుండా అందరిలో ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండడం విశేషం.

ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్, సైఫ్‌ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సీనియర్ హీరోని అనుకుంటున్నారట. గతంలో కోలీవుడ్ స్టార్ విక్రమ్ పేరు వినిపించింది. విక్రమ్ నటిస్తాడా..? లేక వేరే హీరోని రంగంలోకి దింపుతారా అనేది తెలియాల్సివుంది. ఇందులో మరో కథానాయిక పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. అనన్య పాండే లైగర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.

ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. షూట్ వేగంగా జరగనుంది. ఇక కథ విషయానికి వస్తే.. సముద్రం నేపథ్యంలో సాగే ఈ కథలో కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్  చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం  డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలని కొరటాల కసితో వర్క్ చేస్తున్నాడు. మరి.. ఎన్టీఆర్, కొరటాల కలిసి బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్