One Lakh Scheme: చేతి వృత్తుల వారికి నేటి నుంచి లక్ష సాయం

కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతి వృత్తులవారి కోసం మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నది.

కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తులవారి కోసం మరో కొత్త కార్యక్రమానికి తీసుకొస్తున్నది. అర్హులైన లబ్ధిదారులు తమకు అవసరమైన పనిముట్లు, ముడిసరుకులు కొనుగోలు చేసుకునేందుకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నది.

ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలో 200 మంది అర్హులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *