Friday, April 26, 2024
HomeTrending Newsబీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాలు - అస‌దుద్దీన్ ఓవైసీ

బీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాలు – అస‌దుద్దీన్ ఓవైసీ

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని కేంద్రంలోని మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసిన‌ట్లు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చిన‌ట్లు అస‌ద్ పేర్కొన్నారు. ముస్లింల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌ల్లో ఆయుధాలు పెట్టుకోవాల‌ని పిలుపునిచ్చిన‌ట్లు ఆరోపించారు.

మ‌రో వైపు బీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ‌ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని క‌క్ష్య సాధింపు ఉద్దేశంతోనే మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసిన‌ట్లు ఎంపీ అస‌ద్ త‌న ట్వీట్‌లో ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్