Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్అమిత్ షాతో గోపీచంద్ భేటీ

అమిత్ షాతో గోపీచంద్ భేటీ

జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా తో మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు గోపీచంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం హోం మంత్రి బేగంపేట్ టూరిజం ప్లాజాలో బిజెపి రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం  అయ్యారు. అక్కడ గోపీచంద్ తో పాటు పలువురు ప్రముఖులతో అమిత్ షా భేటీ అయ్యారు.

తమ భేటీలో రాజకీయాలు చర్చించలేదని, దేశంలో క్రీడారంగ అభివృద్ధిపై మాత్రమే మాట్లాడుకున్నామని తెలిపారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత ఊతమిస్తుందని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు గోపీచంద్ పేర్కొన్నారు.

Also Read: సెప్టెంబర్ 17తో ఓటు బ్యాంకు రాజకీయాలు అమిత్ షా

RELATED ARTICLES

Most Popular

న్యూస్