Monday, September 30, 2024
Homeసినిమాసంక్రాంతికి విందుభోజనం వీరసింహారెడ్డి - బాలకృష్ణ

సంక్రాంతికి విందుభోజనం వీరసింహారెడ్డి – బాలకృష్ణ

బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో మూవీ ‘వీరసింహారెడ్డి‘. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజైంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ సినిమా తరువాత చేసే సినిమా, కనీసం దానికి దగ్గరలోకి వెళ్లేలా ఉండాలని అనుకున్నాను. ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందని భావించాను. అలాంటి సమయంలోనే గోపీచంద్ మలినేని ఈ కథను వినిపించాడన్నారు. ఈ రోజున ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అందుకు ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. దర్శకుడిగా గోపీచంద్ మలినేని తనకి కావలసిన అవుట్ పుట్ ను రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ .. తమన్ సాంగ్స్ .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి అన్నారు బాలకృష్ణ.

ఇంకా బాలయ్య ఏమన్నారంటే.. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ చెల్లెలి పాత్రను పోషించింది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పాను. ఫస్టు టైమ్ తెర పై ఆ విషయం రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ థ్రిల్ కావాలనే ఉద్దేశంతో అలా చేశాము.  భైరవద్వీపం సినిమాలో కురూపి లుక్ ను కూడా అలాగే గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ సినిమాలో చెల్లెలి పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా పోషించింది. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమా విందుభోజనమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు బాలయ్య.

Also Read : Veera Simha Reddy Review : బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చినట్టే! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్