Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్BCCI: కివీస్, ఆసీస్ సిరీస్ లకు జట్టు ఎంపిక

BCCI: కివీస్, ఆసీస్ సిరీస్ లకు జట్టు ఎంపిక

ఈనెల 18 నుంచి న్యూజిలాండ్ తో పాటు ఫిబ్రవరి రెండో వారం నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ కు గాను తొలి రెండు టెస్టులకు భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది.

కివీస్ తో సిరీస్ కు వ్యక్తిగత కారణాలతో కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరమయ్యారు. కాగా రవీంద్ర జడేజా ఫిట్ నెస్ ను పరిగణన లోకి తీసుకున్న తరువాత ఆసీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ తుది జట్టులో అతణ్ణి ఎంపిక చేస్తామని బిసిఐఐ సెలక్షన్ కమిటీ వెల్లడించింది.

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్,  సూర్య కుమార్ యాదవ్, కెఎస్ భరత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వి షా, ముఖేష్ కుమార్,

వన్డే సిరీస్ లో ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తోపాటు శ్రేయాస్ అయ్యర్, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్, షాబాజ్ అహ్మద్ లను టి 20 టీమ్ కు తప్పించారు.

వీరి స్థానంలో… రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ, అర్ష్ దీప్ సింగ్, శివమ్ మావి, పృథ్వి షా, ముఖేష్ కుమార్ లను ఎంపిక చేశారు.

ఇక ఆస్ట్రేలియా తో జరిగే టెస్టు సిరీస్ లో తొలి రెండు టెస్టులకు…

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయ్ దేవ్ ఉనాద్కత్, సూర్య కుమార్ యాదవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్